ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల తాలూకు విడాకుల ఇష్యూలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఇప్పటికే మెగా ఫ్యామిలీలో శ్రీజ తాలూకు డివోర్స్ ఇష్యూ చర్చనీయాంశం కాగా.. ఇప్పుడు  నిహారిక విడాకుల మ్యాటర్ చర్చల్లోకి వచ్చింది.

2020 డిసెంబర్‌లో చైతన్య జొన్నలగడ్డని వివాహం పెళ్లి చేసుకున్న నిహారిక అప్పటినుంచి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. అయితే

అనూహ్యంగా వీళ్లిద్దరి డివోర్స్ ఇష్యూ తెరపైకి వచ్చింది.

దీనికితోడు సోషల్‌ మీడియా మాధ్యమమైన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఇద్దరు ఒకనొకరు అన్‌ ఫాలో చేసుకోవడం పలు అనుమానాలు లేవనెత్తింది.

ఆ మధ్య నిహారిక- చైతన్య డివోర్స్ ఇష్యూ వైరల్ కాగా.. ఆ వార్తలకు కాస్త బ్రేక్ వచ్చినా మళ్లీ ఇప్పుడు చర్చల్లోకి వచ్చింది.

చైతన్య జొన్నలగడ్డ ఏకంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ నుంచి తన పెళ్లి ఫోటోలను డిలీట్‌ చేయడంతో మరోసారి దుమారం రేగింది.

చూడాలి మరి దీనిపై మెగా ఫ్యామిలీ రియాక్ట్ అవుతుందా.. లేదా అనేది.