హీరో నాని కొత్త సినిమానికి శ్రీకారం చుట్టారు. ఆయన నటిస్తున్న ఈ 30వ  చిత్రంతో శౌర్యువ్‌ అనే మరో కొత్త డైరెక్టర్ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు

ఈ చిత్రాన్ని చెరుకూరి మోహన్‌, విజయేందర్‌ రెడ్డి, మూర్తి కలగర సంయుక్తంగా నిర్మిస్తున్నారు

ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్ గా నటిస్తుంది

మంగళవారం హైదరాబాద్‌లో ఈ మూవీ  పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది

చిరంజీవి క్లాప్‌ కొట్టి ముహూర్తం సన్నివేశాన్ని ప్రారంభించగా అశ్వినీదత్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు

ఈ కార్యక్రమంలో బుచ్చిబాబు, కిషోర్‌ తిరుమల, హను రాఘవపూడి, వశిష్ఠ, వివేక్‌ ఆత్రేయ సంయుక్తంగా గౌరవ దర్శకత్వం వహించారు

విజయేంద్ర ప్రసాద్‌ స్క్రిప్ట్‌ అందించారు

తండ్రీకూతుళ్ల అనుబంధాల నేపథ్యంలో సాగే కథతో తెరెక్కుతున్న ఈ చిత్ర రెగ్యులర్‌ షూట్ బుధవారం నుంచే  మొదలుకానుంది