సీతారామం చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసిన భామ మృణాల్‌ ఠాకూర్‌.

ప్రస్తుతం నానికి జోడిగా ఓ చిత్రంలో నటిస్తుంది ఈ బ్యూటీ.

కాగా మరో క్రేజీ తెలుగు హీరో సరసన నటించనున్నట్లు సమాచారం.

ఆ హీరో ఎవరో కాదు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.

కథా నచ్చడంతో మృణాల్‌ ఈ చిత్రానికి పచ్చ జండా ఊపిందని తెలిసింది.

ఈ చిత్రం ‘గీత గోవిందం’ లాంటి రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని వారంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్ జులై నుంచి మొదలుకానుంది.

ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు.

కాగా ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ ‘ఖుషి’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.