చెట్లు, మొక్కలు పర్యావరణ పరిరక్షణలో చాలా ప్రముఖ పాత్రను పోషిస్తాయి. ఇంట్లో నాటిన మొక్కలు ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా పాజిటివ్ ఎనర్జీని కూడా అందిస్తాయి.

వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం, ఇల్లు లేదా బాల్కనీ లోపల మనీ ప్లాంట్ సరైన దిశలో ఉంచడం వలన శుభ ఫలితాలను అందిస్తుంది..

అదే విధంగా ఒక సాధారణ మనీ ప్లాంట్ పరిష్కారం అంటే వ్యూహం కూడా మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది.

లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారం నాడు మీ ఇంట్లోని మనీ ప్లాంట్ కు ఎర్రటి దారం కట్టండి. ఇది సంపదను తీసుకురావడమే కాకుండా ఇంట్లో సానుకూలతను కూడా ఉంచుతుంది.

శుక్రవారాల్లో మనీ ప్లాంట్ కు పచ్చి పాలను వేయడం వలన శుభఫలితాలు అందుకుంటారు. కుటుంబానికి ఆకస్మిక సంపద లభిస్తుంది.

అంటే, ఉద్యోగుల ఆదాయం పెరుగుతుంది అదే సమయంలో వ్యాపారస్థులు లాభాలను అందుకుంటారు.

వాస్తుశాస్త్ర నియమాల ప్రకారం.. మనీ ప్లాంట్‌ను ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో నాటాలి. పొరపాటున కూడా దక్షిణ దిశలో నాటకూడదు.

ఇక్కడ మరో ముఖ్య విషయం ఏమిటంటే.. మనీ ప్లాంట్‌ను ఎప్పుడూ నేరుగా భూమిలో నాటకూడదు. మట్టి కుండ లేదా గాజు సీసాలో నాటాలి.