‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్ బూస్టర్ అందుకున్న చిరు ప్రస్తుతం ‘భోళా శంకర్‌’గా అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మెహర్‌ రమేష్‌ రూపొందిస్తున్నారు.

రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరుకి జోడీగా తమన్నా నటిస్తుంది.

కీర్తి సురేష్‌ ఈ చిత్రంలో చిరు చెల్లెలిగా కనిపించనున్నారు.

సోమవారం కార్మికుల దినోత్సవం సందర్భంగా  చిరు కొత్త లుక్ పోస్టర్లు విడుదల చేసింది చిత్ర బృందం.

ఆ పోస్టర్లో ఆయన టాక్సీ డ్రైవర్‌గా చేతిలో టీ కప్పుతో మాస్‌ స్టైలిష్‌ లుక్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్  జరుగుతోంది. దీని తర్వాత షెడ్యూల్‌ కోల్‌కతాలో మొదలవుతుంది.

కాగా ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.