పొన్నియన్‌ సెల్వన్‌ సినిమాతో నాలుగేళ్ల తర్వాత సిల్వర్‌ స్ర్కీన్‌పై దర్శనమిచ్చారు ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌.అందం, అభినయంతో సర్వత్రా ప్రశంసలు అందుకుంటుంది..

తాజాగా టాలీవుడ్‌ సీనియర్‌ నటీమణి మీనా, ఐశ్వర్యరాయ్‌ గురించి సోషల్‌ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

ఐశ్వర్యను చూస్తుంటే జీవితంలో మొదటిసారి అసూయ కలుగుతోందన్నారు. పొన్నియన్‌ సెల్వన్ మూవీలో ఐశ్వర్య చేసిన నందిని పాత్ర ‘తన డ్రీమ్‌ క్యారెక్టర్‌ అని,

ఆ క్యారెక్టర్‌ కొట్టేసిన ఐశ్వర్యారాయ్‌ని చూస్తుంటే జీవితంలో తొలిసారి సాటి నటిపై అసూయ కలుగుతుందన్నారు.

తన జీవితంలో ఒకరిని చూసి అసూయ పడడం ఇదే మొదటిసారన్నారు. పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో నటించిన నటీనటులందరికీ తన అభినందనలు అని’ పీఎస్‌-1లో ఐశ్వర్య స్టిల్స్‌ను షేర్‌ చేసారు మీనా.

ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మీనా చెప్పింది నిజమేనంటూ ఐష్‌ ఫ్యాన్స్‌ తెగ సంబరపడిపోతున్నారు.

కాగా సెప్టెంబర్‌ 30 న విడుదలైన పొన్నియన్‌ సెల్వన్‌ మొదటి రోజే దాదాపు 39 కోట్లు రాబట్టింది.