భార‌త్‌లో మారుతి సుజుకి న్యూ ఎస్‌యూవీ జిమ్నీ లాంఛ్ అయింది

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆఫ్-రోడర్ జిమ్నీని విడుదల చేసింది

మహింద్ర థార్‌కు పోటీగా ఈ మారుతి జిమ్నీ మార్కెట్లో అడుగు పెట్టింది

 మొదట ఈ మారుతి సుజుకీ జిమ్నీని ఆటో ఎక్స్ పో 2023లో ఆవిష్కరించారు

ఐదు డోర్లతో కూడిన ఈ ఎస్‌యూవీ దేశీ మార్కెట్‌లో రూ. 12.74 ల‌క్షల నుంచి అందుబాటులో ఉంటుంది

జిమ్నీ క‌స్టమ‌ర్ డెలివరీలు కూడా ప్రారంభ‌మ‌య్యాయి

ఈ ఎస్‌యూవీ విక్రయాలు మారుతి నెక్సా అవుట్‌లెట్స్ నుంచి జ‌రగ‌నున్నాయి

Zeta MT వేరియంట్ ధర రూ. 1,274,000. (ఎక్స్-షోరూమ్)

Zeta AT వేరియంట్ ధర రూ. 1,394,000. (ఎక్స్-షోరూమ్)