సినిమాలే కాదు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు.
ఇక మహేశ్ అడుగుజాడల్లోనే నడుస్తోంది ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్. పిల్లల బాధ్యతలు, ఇంటి పనులు చూసుకోవడంతో పాటు మహేశ్ సినిమాలు, బిజినెస్ వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటోంది.
తాజాగా మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకుంది మహేశ్ సతీమణి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ లేడీ ఏవియేషన్ స్టూడెంట్ కి ప్రత్యేకంగా లాప్టాప్ని అందించింది.
అదేవిధంగా ఆ విద్యార్థిని చదువుకయ్యే ఖర్చులని కూడా భరిస్తానని హామీ ఇచ్చింది.ఈ సందర్భంగా అమ్మాయితో పాటు ఆమె తండ్రి కూడా మహేశ్- నమ్రత దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
చదువుకునేందుకు నాకు అన్ని విధాలా చేయూత నందిస్తోన్న మహేశ్ బాబు గారికి, నమ్రతా మేడమ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’ అని సదరు స్టూడెంట్ చెప్పుకొచ్చింది.
అలాగే అమ్మాయి తండ్రి కూడా మహేశ్ దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను సౌతిండియన్ ఫిల్మ్స్ పీఆర్ అండ్ మార్కెటింగ్ కన్సల్టెంట్ వంశీ శేఖర్ ట్విట్టర్లో షేర్ చేశాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు మహేశ్ దంపతులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.