టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం ఈయన గుంటూరు కారం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. 

ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న విషయం మనకు తెలిసిందే.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించినటువంటి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు పొందిన వారందరూ కూడా ఒక్కో సినిమాకు 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. 

అయితే మహేష్ బాబు ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలలో నటించలేదు.

కానీ రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం ఈయన ఏకంగా 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.

ఇలా ఈ స్థాయిలో మహేష్ బాబు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.