లైగర్‌ సినిమా విడుదలకు ముహూర్తం ముంచుకొస్తోంది.దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసింది చిత్రబృందం.

తాజాగా ఈ చిత్రబృందం పంజాబ్‌లో పర్యటించింది. చండీగఢ్‌  కార్యక్రమంలో లైగర్‌ నుంచి మూడో పాట విడుదల చేశారు.

ఈకార్యక్రమంలో హీరోహీరోయిన్లతో పాటు డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ కూడా సందడి చేశారు.

కాగా ఈ ప్రమోషనల్‌ ఈవెంట్‌లో విజయ్‌, అనన్య సంప్రదాయ దుస్తులు ధరించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.

ప్రస్తుతం లైగర్‌ పంజాబ్‌ టూర్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.

విజయ్ దేవరకొండ అనన్య ను ఎత్తుకున్న పిక్ కు కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్