ప్రతి రోజు జామపండు తినండి.. ఈ రోగాలను తరిమి కొట్టండి

Phani CH

10 SEp 2024

జామపండు లో విటమిన్ సి ఉంటుంది. ఇందులో నారింజ కంటే 2 రెట్లు ఎక్కువ ఉంటుంది. ప్రతి రోజు ఒక జామ పండు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

డయాబెటిస్ రోగులు తినడానికి ఏకైక అనువైన పండు జామకాయ. దీనిలో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. జామ ఆకు రసం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

జామపండు లో ఉండే పొటాషియం, సోడియం అధిక రక్తపోటును తగ్గించడానికి.. చెడు కొలెస్ట్రాల్ లను తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

జామకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని వల్ల జీర్ణ క్రియ మెరుగై బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

జామకాయలో కెరోటిన్, లైకోపీన్, విటమిన్ ఎ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం యొక్క  ముడతలను తగ్గించి చర్మం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది.

జామ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, అయితే ఇది పుట్టబోయే బిడ్డ యొక్క పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. 

మహిళలకు రోజూ జామ ఆకు రసం తీసుకోవడం వల్ల పీరియడ్స్ ద్వారా వచ్చే పెయిన్ తీవ్రతను గణనీయంగా తగ్గిస్తుంది.