హైదరాబాద్ టూ అయోధ్య వయా వారణాసి.. ఐఆర్సిటీసి నయా టూర్ ప్యాకేజీ..
25 May 2025
Prudvi Battula
అయోధ్య వెళ్లేవారి కోసం తాజాగా ఐఆర్సిటీసి 'గంగా రామాయణ పుణ్య క్షేత్ర యాత్ర' పేరుతో అయోధ్య టూర్ ప్యాకేజీని ప్రకటించింది.
ఈ టూర్ 9 రోజులు, 8 రాత్రులు కొనసాగనుంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకొంటే వచ్చే నెల 14న సికింద్రాబాద్ నుంచి యాత్ర స్టార్ట్ అవుతుంది.
ఈ టూర్ ప్యాకేజీలో వారణాసి, అయోధ్య, నైమిశారణ్య, ప్రయాగ్రాజ్, శృంగవర్పూర్ పుణ్య క్షేత్రాలను దర్శించుకోవచ్చు.
భారత్ గౌరవ్ టూరిస్ట్స్ రైలు ద్వారా 2AC, 3AC, SL తరగతులలో “గంగా రామాయణ పుణ్య క్షేత్ర యాత్ర” టూర్ ప్యాకేజీని నడపాలని ప్రతిపాదించింది.
ఈ టూర్ ధరలు విషయానికి వస్తే ఎకానమీ (SL) పెద్దలకు రూ. 16,200, పిల్లలకు రూ. 15,200గా నిర్ణయించింది రైల్వే శాఖ.
అలాగే స్టాండర్డ్ (3AC) పెద్దలకు రూ. 26,500, పిల్లలకు రూ. 25,300; కంఫర్ట్ (2AC) పెద్దలకు రూ. 35,000, పిల్లలకు రూ. 33,600గా ఉన్నాయి.
సికింద్రాబాద్, జనగాం, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, పలాస ఈ ప్యాకేజీ బోర్డింగ్ పాయింట్స్.
మరిన్ని వివరాలు, బుకింగ్ కోసం https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCZBG44 లింక్ పై క్లిక్ చెయ్యండి.
మరిన్ని వెబ్ స్టోరీస్
జీలకర్రతో ఇలా చేస్తే చాలు.. అజీర్తి, గ్యాస్ సమస్య దూరం..
పిల్లలను హాగ్ చేసుకోవడం లేదా.? ఆలా మారిపోతారు..
విదేశాల్లో విలసిల్లుతున్న భారీ హిందూ దేవుళ్ల విగ్రహాలు ఇవే..