కోణార్క్ సూర్య దేవాలయం గురించి ఇవి తెలుసా.?
03 June 2025
Prudvi Battula
కోణార్క్ ఆలయాన్ని 1250 AD శతాబ్దంలో రాజు నరసింహ దేవ్ - I నిర్మించారు. ఈ ఆలయం సూర్య భగవానుడికి అంకితం చేశారు.
ఒడిశాలో ఉన్న ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. భువనేశ్వర్ నుండి 66 కి.మీ. దూరంలో ఉంది.
ఈ ఆలయానికి ఇరువైపులా 12 చక్రాల రేఖలు ఉన్నాయి. ఈ చక్రాలు గంటలను ప్రదర్శిస్తాయి. వీటిపై పడే నీడ ద్వారా టైం తెలుసుకోవచ్చు.
ఈ దేవాలయం పైభాగంలో అయస్కాంత రాయిని ఉంచినట్లు చెబుతారు. ఆ అయస్కాంత రాయి ఇప్పుడు ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు.
15వ శతాబ్దంలో ఆక్రమణదారులు ఈ ఆలయాన్ని దోచుకున్నారని, ఇక్కడ ప్రతిష్టించిన విగ్రహాన్ని కాపాడేందుకు పూజారులు పూరీకి తీసుకెళ్లారని చెబుతారు.
దోపిడీ కారణంగా ఆలయం బాగా దెబ్బతినడంతో ఆలయ ప్రధాన ద్వారం ఇసుకతో కప్పబడి ఉంది. ఈ ఆలయం కాలక్రమేణా ప్రకృతి వైపరీత్యాల బారిన పడింది.
18వ శతాబ్దంలో ఆలయ శిఖరం కూలిపోయిందని, ఆ తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా గర్భగుడిని మూసివేశారని చెబుతారు.
118 సంవత్సరాల క్రితం, ఆలయంలోని ఈ ఆడిటోరియం గదిని రక్షించడానికి బ్రిటీష్ వారు ఆలయం లోపలి భాగాన్ని ఇసుకతో నింపారు.
ఆలయ గర్భగుడిలో గడ్డ కట్టిన ఇసుకను తొలగిస్తే ఆలయ నిర్మాణానికి మరింత నష్టం వాటిల్లుతుందని నిపుణులు భావిస్తున్నారు.
1903లో, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకుని, పరిరక్షణ పనులను ప్రారంభించింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
మీరు తాగే టీ రకం బట్టి మీరు ఎలాంటి వారో తెలిసిపోతుంది.!
ఈ ఫాక్ట్స్ తెలిస్తే అవాక్ అవుతారు.!
ఇంట్లో వీటిని ఉంచుతున్నారా.? అశుభం అంటున్న పండితులు..