మహేష్‌ బాబు '1: నేనొక్కడినే' చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది బాలీవుడ్‌ బ్యూటీ కృతి సనన్‌.

ప్రస్తుతం ప్రభాస్‌ రాముడిగా నటించిన  ‘ఆదిపురుష్‌’ చిత్రంలో సీతగా కనిపించనున్న సంగతి తెలిసింది.

ఈ చిత్రం జూన్‌ 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా సీతగా తననే ఎందుకు ఎంపిక చేశారో అన్నదానిపై ఓ విషయాన్ని తెలిపింది కృతి సనన్‌.

''ఆదిపురుష్‌’లో ఛాన్స్ రావడం నా అదృం.. నా హైట్ ఎక్కువగా ఉండటం వ‌ల్ల‌ గతంలో చాలా అఫర్లు వచ్చినట్లే వచ్చి, పోయాయి.

కానీ ఆదిపురుష్ విషయంలో హైటే నాకు ప్ల‌స్ అయింది.

ప్రభాస్‌ మంచి ఎత్తు ఉన్న హీరో.. కాబట్టి నేను అయితేనే ఆయన పక్కన సెట్‌ అవుతానని మేకర్స్‌ సంప్రదించారు.

సీతగా నన్ను ఎంపిక చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది'. అని చెప్పింది కృతి సనన్‌.

దీంతో ఈ కామెంట్స్‌ నెట్టింట్ట వైరల్‌గా మారాయి.

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కృతి స‌నన్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతు ఈ చిత్రంతో తెలుగులో మంచి అవకాశాలు వస్తాయని కామెంట్స్‌ చేస్తున్నారు.