ఓం రౌత్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ రాముడి పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘ఆదిపురుష్‌’.

రామాయణం ఆధారంగా రూపొందితున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి కృతిసనన్‌ సీత పాత్ర పోషిస్తోన్న విషయం తెలిసిందే.

జూన్ 16న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

దీంతో ప్రమోషన్స్‌ పర్వం షురూ చేసింది చిత్రబృందం.

ఈ నేపథ్యంలో ఈ సినిమా శనివారం ఉదయం కొత్త పోస్టర్లు, మోషన్‌ పోస్టర్‌  విడుదల చేసింది చిత్రబృందం.

ఈ మోషన్‌ పోస్టర్‌లో సీతమ్మగా లంకలో రాముడి రాక కోసం కంటతడితో ఎదురుచూస్తున్నట్లు కృతిసనన్‌ ఆకట్టుకునేలా ఉన్నారు.

అలాగే, శ్రీరాముడు హనుమంతుడితో కలిసి లంకకు పయనమైనట్లు కూడా కనిపిస్తుంది.

తాజాగా విడుదలైన ఈ పోస్టర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.