ఉప్పెన చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్లాక్ బూస్టర్ అందుకున్న బ్యూటీ కృతిశెట్టి.

తర్వాత నటించిన శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు చిత్రాలు కూడా భారీ అందుకున్నాయి.

హ్యాట్రిక్‌ హిట్స్‌తో దూసుకుపోతున్న కృతిని ప్రస్తుతం వరుస ఫ్లాపులు  వెంటాడుతున్నాయి.

ఇదిలా ఉంటే కృతిపై ట్రోలింగ్‌ పేరిట విమర్శలు పెరిగిపోతున్నాయి

ఈ మధ్య కృతి ఫేస్‌లో కొన్ని మార్పులు వచ్చాయని, ఆమె ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుందని రూమర్స్‌ వస్తున్నాయి.

తాజాగా దీనిపై స్పందించిన బేబమ్మ.. 'ఇలాంటివి ఎవరు రాస్తారో, ఎందుకు రాస్తారో కూడా అర్థం కావడం లేదు.

మాకు కూడా ఫ్యామిలీస్‌ ఉంటాయి. ఇలాంటి రూమర్స్‌ విన్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.

ఉప్పెనలో ఉన్నట్లు ఇప్పుడు లేను అంటున్నారు. అయినా ఎప్పుడూ ఒకేలా ఉండలేము కదా..ఫీచర్స్‌ మారుతాయి.

అందరిలా నేను కూడా. కొన్నిసార్లు మేకప్‌, హెయిర్‌ స్టైల్‌ వల్ల కూడా మార్పులు కనిపిస్తాయి.

అంతమాత్రానా ప్లాస్టిక్‌ సర్జరీ అంటారా''? అని ఫైర్‌ అయ్యింది.