ఇండియన్ సినిమా చరిత్రలో ఏ ఒక్కరూ సోగ్గాడు శోభన్ బాబు ఆస్తులకు దరిదాపుల్లో కూడా లేరంటే మీరు నమ్ముతారా.

1970వ దశకంలోనే మద్రాసులో రారాజుగా వెలిగిన శోభన్​ బాబు ఎంతో ముందు చూపుతో ఆస్తులు కూడబెట్టారు.

నాడు శోభన్ బాబు పెట్టిన పెట్టుబడులు నేడు ఎన్నో రెట్లు పెరిగి ఊహించని సంపదను పోగు చేశాయి.

చెన్నైలోనే ఫేమస్ అయిన​ అన్నానగర్ ఏరియాలో సింహభాగం ఆస్తులు కలిగిన ఒకే ఒక్కడు శోభన్ బాబు అంటే అవాక్కవ్వాల్సిందే.

అన్నానగర్​లో శోభన్ బాబు పేరిట ఏకంగా 18 ప్రాపర్టీస్ ఉండేవట వాటన్నింటినీ కారులో చుట్టి రావడానికే ఒక పూట పట్టేదట.

ఇలాంటి ఆస్తులు చెన్నై వ్యాప్తంగా ఎన్నో చోట్ల కొనుగోలు చేశారు శోభన్ బాబు.

నగర మెయిన్​రోడ్డును ఆనుకుని 30 ఎకరాల తోటను తమిళ్ హీరో మాధవన్ తాత నుంచి శోభన్ బాబు కొనుగోలు చేశారు అప్పట్లో ఆ తోట విలువ 30 లక్షలు.