చాలా కాలంగా ప్రేమించుకుంటున్న ఈ స్టార్ జోడి ..పెళ్లెప్పుడు చేసుకుంటారని వస్తున్న ప్రశ్నలకు తమ గ్రాండ్ వెడ్డింగ్‌తో ఫుల్‌స్టాప్ పెట్టారు.

బాలీవుడ్ లబ్ బర్డ్స్ కియారా ఆద్వానీ, సిద్దార్ధ్ మల్హోత్రా పెళ్లి మంగళవారం గ్రాండ్‌గా జరిగింది.

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ సూర్యాఘర్ ప్యాలెస్‌లో బంధుమిత్రుల సమక్షంలో ఈ స్టార్ జోడీ ఒక్కటయ్యారు.

హిందూ సంప్రదాయ పద్దతిలో జరిగిన వీరి వివాహ వేడుకల ఫోటోలతో పాటు ఒకరినొకరు ముద్దుపెట్టుకున్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసారు.

సిద్దార్ధ్‌ మల్హోత్రా ఇప్పుడు మా బంధం పర్మినెంట్‌గా బుకింగ్ అయింది..మీ ఆశీర్వాదాలే కావాలంటూ కామెంట్ పోస్ట్ చేశాడు.

ఇద్దరూ ఒకే కామెంట్‌ని షేర్ చేసారు. వీరి పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

వీరిద్దరి మ్యారేజ్ ఫోటోలు షేర్ చేసిన గంటల్లోనే 15లక్షల లైక్‌లు వచ్చాయి. అందరూ పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.