చిన్న సినిమాగా వచ్చి పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ‘కాంతార’.
రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ తరకెక్కించిన చిత్రమిది.
గత ఏడాది ఆగస్టు 27న విడుదలైన ఈ చిత్రాన్ని హూంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించారు.
కర్ణాటకలో ‘భూత కోల’ నేపథ్యంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది.
కన్నడ భాషలో కెజిఎఫ్ చాప్టర్ 2 అత్యధిక వసూళ్లు సంధించిన చిత్రంగా నిలిచింది.
ఈ చిత్రానికి ప్రీక్వెల్ రానున్న సంగతి తెలిసిందే.
వాస్తవానికి ‘కాంతార’ పార్ట్ 2 చిత్రం. పార్ట్ 1 వచ్చే ఏడాది రాబోతుందాని తెలిపారు రిషబ్.
దాని కోసం పరిశోధన చేస్తూ మార్చిలో ఉగాది పండగ రోజు నుంచి స్క్రిప్ట్ మొదలుపెట్టానని అన్నారు అయన.
ఈ చిత్రం 2024లో ప్రేక్షకులని అలరించనుందని ప్రకటించారు రిషబ్ శెట్టి.