తెలుగు చిత్రాలకు, నటీనటులకు ఇప్పుడు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తోంది.

ఇప్పటికే పలువురు టాలీవుడ్‌ నటీనటులు అంతర్జాతీయ అవార్డులు కైవసం చేసుకున్నారు.

కాగా తాజాగా మరో ఇంటర్నేషనల్‌ అవార్డు సీనియర్‌ హీరో జేడీ చక్రవర్తిని  వరించింది.

నైజీరియాలో ప్రతిష్టాత్మకంగా భావించే ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో  జేడీ చక్రవర్తి అవార్డు కైవసం చేసుకున్నారు.

దహిణి ది విచ్ అనే చిత్రంలోని అయన నటనకు గానూ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు గెలుపొందారు.

రాజేష్ టచ్‌రివర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సునీతా కృష్ణన్, ప్రదీప్ నారాయణన్‌ సంయుక్తంగా నిర్మించారు.

తనిష్ట ఛటర్జీ, జేడీ చక్రవర్తి, శ్రుతి జయన్ తదితరులు  ముఖ్య పాత్రలు పోషించారు.

కాగా ఈ చిత్రం ఇప్పటికే 18 అంతర్జాతీయ అవార్డులు కైవసం చేసుకుంది.