యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ గ్లామర్ పాత్రల కంటే కూడా కొత్తదనం నిండిన కథలతో ఎక్కువగా ప్రయాణం చేస్తోంది
ఇటీవలే ‘మిలీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది జాన్వీ
ఈ చిత్రం విజయం సాధించలేకపోయినా జాన్వీ నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి
తాజాగా ఆమె ఓ స్పై థ్రిల్లర్ సినిమాలో నటించడానికి ఓకే చెప్పినట్లు సమాచారం
జంగ్లీ పిక్చర్స్ ‘ఉలఝ్’ అనే టైటిల్ తో భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ స్పైగా కనిపించనుంది
మూడు ప్రధాన పాత్రల చుట్టూ తిరిగే ఈ చిత్రంలో మలయాళ నటుడు రోషన్ మాథ్యూ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు
సుధాన్షు సరియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మూడో పాత్రలో ఓ సీనియర్ యాక్టర్ నటించే అవకాశాలున్నాయిని సమాచారం
‘రాజీ’ తర్వాత ఈ సంస్థ నుంచి వస్తోన్న మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది