దివంగత నటి, అందాల తార శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్.
ప్రస్తుతం జాన్వీ ఎన్టీఆర్ సరసన ఎన్టీఆర్30 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రంతోనే టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ కు పరిచయం కాబోతుంది జాన్వీ.
ప్రస్తుతం హైదరాబాద్లో రామోజీ ఫిల్మ్సిటీలో ఈ చిత్రం షూటింగ్లో బిజీగా ఉంది ఈ భామ.
ఈ మూవీ చిత్రీకరణలో ఉండగానే మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది జాన్వీ.
ఉప్పెనతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు- రామ్చరణ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్గా ఎంపికైంది జాన్వీ.
ఈ విషయమై ఆమెను సంప్రదించగా వెంటనే ఓకే చెప్పిందట.
కాగా దినికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.