‘జైలర్‌’ డబ్బింగ్‌ షురూ..

చిత్రప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న రజినీకాంత్ చిత్రం ‘జైలర్‌’.

ఈ చిత్రాన్ని నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తెరకెక్కిస్తున్నారు.

ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.

ఆగస్టు 10న ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది.

ఈ చిత్రంలో మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, జాకీష్రాఫ్‌, తమన్నా, రమ్యకృష్ణ, సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

కాగా ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ ఉంది.

అందులో భాగంగానే డబ్బింగ్‌ షురూ చేసింది చిత్రబృందం.

వచ్చేవారం నుంచి రజనీ డబ్బింగ్‌ చెప్పనున్నట్లు ప్రకటించారు మూవీ మేకర్స్.

ఈ చిత్రం పలు భారతీయ భాషల్లో పాన్ స్థాయిలో విడుదల కానుంది.