నట సింహం నందమూరి బాలయ్య బొమ్మ పడితే చాలు.. జై బాలయ్య అని అసంకల్పితంగా అనేస్తుంటారు అందరూ.!

అందులో హీరోలు.. హీరోయిన్లు కూడా తప్పకుండా ఉంటారు. అలా అరుస్తూనే బాలయ్య పై తమకున్న ఇష్టాన్ని బయట పెడుతుంటారు.

ఇక తాజాగా హిట్ 2 హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా అదే చేశారు.

అడివి శేష్ హీరోగా. హిట్ 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. 

ఇక ఈ ఈవెంట్‌కు హోస్ట్ చేసిన సుమ.. ఫన్నీ స్కిట్ చేస్తున్న క్రమంలోనే బాలయ్య బొమ్మ ఎల్‌ ఈడీ స్క్రీన్స్ పై ఒక్క సారిగా పాపప్‌ అయింది.

దీంతో ఆడిటోరియం మొత్తం దద్దరిల్లింది. ఇక ఇది విట్‌నెస్ చేసిన హీరోయిన్ మీనాక్షి కూడా జై బాలయ్య అంటూ.. అరిచింది.

తన అరుపుతో.. బాలయ్య మీద చూపించిన ఇష్టంతో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.