కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది

రెండేళ్లు కరోనా విజృంభణ తర్వాత ఈ సీజన్​లోనే భక్తులను పూర్తి స్థాయిలో శబరిమలకు అనుమతించారు

ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్నా భక్తులు మొక్కులు, కానుకలను అయ్యప్పకు సమర్పించారు

కాగా, హుండీల్లో నోట్ల లెక్కింపు పూర్తైందని అధికారులు తెలిపారు

శుక్రవారంతో వార్షిక తీర్థయాత్ర సీజన్ ముగియనుండగా.. ఈ సీజన్​లో ఇప్పటివరకు రూ.318 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు

కాయిన్లను లెక్కించాల్సి ఉందని ఇవి మరో రూ.ఏడు కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు

ఇతర కానుకలను కలుపుకొంటే మొత్తం ఆదాయం రూ.330 కోట్ల వరకు చేరొచ్చని పేర్కొన్నారు. ఇది అయ్యప్ప స్వామి ఆలయ చరిత్రలోనే అత్యధికమని చెప్పారు

2018 సీజన్​లో అత్యధికంగా రూ.260 కోట్లు వచ్చాయని.. ఈసారి ఆ రికార్డును తిరగరాస్తూ భారీగా ఆదాయం పెరిగిందని వివరించారు

మరోవైపు, ట్రావెన్​కోర్ దేవస్థానం బోర్డుకు కేరళ హైకోర్టు హుండీ ఆదాయాన్ని లెక్కించే విషయంపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది

డొనేషన్లు, కరెన్సీ నోట్ల లెక్కింపు విషయంలో ఏవైనా అవకతవకలు జరిగాయా అని పరిశీలించాలని బోర్డుకు చెందిన విజిలెన్స్ విభాగానికి ఆదేశాలు జారీ చేసింది