ఆ కారణంతో సినిమాలకు గుడ్ బై చెప్పేస్తోన్న  సాయి పల్లవి..

టాలీవుడ్ అగ్రకథానాయికలలో సాయి పల్లవి ఒకరు. సాయి పల్లవి..

లేడీ పవర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటారు. 

2015లో ప్రేమమ్ సినిమాతో కెరీర్ ప్రారంభించింది. 

ఇప్పటివరకు ఎన్నో  హిట్ చిత్రాల్లో నటించింది. 

ఇప్పుడు సాయి పల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పనుందట. 

ఎంబీబీఎస్ పూర్తిచేసిన ఆమె కెరీర్ పై ఫోకస్ పెట్టిందట. 

కోయంబత్తూరులో  సొంతంగా ఆసుపత్రి నిర్మిస్తోందట. 

ఆ తర్వాత పూర్తిగా డాక్టర్‏గా స్థిరపడనుందని టాక్. 

ఈ ఆసుపత్రిని సాయి పల్లవి, ఆమె చెల్లెలు పూజా కన్నన్ నిర్వహించనున్నారు. 

సాయిపల్లవి చివరిసారిగా గార్గి చిత్రంలో కనిపించింది.