చెత్త రికార్డుల్లో చేరిన టీమిండియా పేసర్.. ప్రపంచ రికార్డ్ బ్రేక్..
ఏప్రిల్ 22న IPL 2023లో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్ తర్వాత అర్ష్దీప్ సింగ్ హీరో నుంచి జీరోగా మారాడు.
పంజాబ్కు చెందిన ఈ ఫాస్ట్బౌలర్ ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో చెత్త రికార్డులో చేరాడు.
అర్ష్దీప్ సింగ్ తన పేరు మీద ఓ అవాంఛనీయ రికార్డు సృష్టించుకున్నాడు.
అర్ష్దీప్ సింగ్ T20 క్రికెట్ చరిత్రలో 4 ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ముంబై ఇండియన్స్పై అర్ష్దీప్ సింగ్ 3.5 ఓవర్లలో 66 పరుగులు ఇచ్చాడు.
2018లో ఆస్ట్రేలియాపై 3.1 ఓవర్లలో 64 పరుగులిచ్చిన బెన్ వీలర్ పేరిటే ఈ రికార్డు ఉంది.
అర్ష్దీప్ సింగ్ ముంబైపై 17.21 ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చాడు.
23 బంతుల్లో 12 బౌండరీలు వచ్చాయి. ఇందులో 4 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. రెండు వైడ్ బాల్స్ ఉన్నాయి.
అర్ష్దీప్ సింగ్ ఈ సీజన్లో 10 మ్యాచ్ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. అయితే ఎకానమీ రేటు 9.80గా నిలిచింది.