IPL 2022 Auction: వేలంలో ఎంట్రీ ఇవ్వనున్న ధోనీ-గంభీర్..!

IPL 2022 మెగా వేలంలో ఈసారి 8 జట్లకు బదులుగా 10 జట్లు పాల్గొంటాయి. ఇప్పటికే అన్ని జట్లు మాక్ డ్రిల్‌లను కూడా ప్రారంభించాయి.

ఈసారి సీఎస్‌కే సారథి ధోనీ, లక్నో మెంటార్ గంభీర్ కూడా వేలంలో ఆయా జట్లతోపాటు పాల్గొనబోతున్నారు.

ఎంపికలో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా తనకు, గంభీర్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని కేఎల్ రాహుల్ తెలిపాడు.

RCB జట్టు హెడ్ కోచ్ సంజయ్ బంగర్, క్రికెట్ డైరెక్టర్ మైక్ హెస్సన్‌తో కలిసి విరాట్ కోహ్లీ కూడా జట్టును నిర్మించే ప్లాన్  చేస్తున్నారు.