‘కార్తికేయ2’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు హీరో నిఖిల్.
ప్రస్తుతం మరో పాన్ ఇండియా చిత్రం ‘స్పై’లో నటిస్తున్నారు.
గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి కె.రాజశేఖర్రెడ్డి కథ అందించడంతో పాటు స్వయంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో నిఖిల్కి జోడిగా ఐశ్వర్య మేనన్ నటిస్తుంది.
సన్యా ఠాకూర్, ఆర్యన్ రాజేష్, జిషు సేన్ గుప్తా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
కాగా ఈ చిత్రాన్ని జూన్ 29న, ఈనెల 12న టీజర్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.
శనివారం ఓ వీడియో గ్లింప్స్ను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి ఈ విషయాన్ని ప్రకటించారు మూవీ మేకర్స్.
ఆజాద్ సుభాష్ చంద్రబోస్ మరణం వెనక దాగి ఉన్న మిస్టరీ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఆ గ్లింప్స్తో తెలియజేశారు.