కెమెరామెన్‌పై రోహిత్ ఫైర్.. నవ్వుకున్న సూర్య.. వైరల్ వీడియో

నాగ్‌పూర్‌ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించింది.

ఆస్ట్రేలియాపై టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు కేవలం 91 పరుగులకే ఆలౌటైంది.

కంగారూ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం కనిపించింది.

ఇండియా రివ్యూ తీసుకున్నప్పుడు, కెమెరామెన్ పెద్ద స్క్రీన్‌పై రోహిత్ శర్మను చూపిస్తున్నాడు.

ఆ సమయంలో టీమిండియా ఆటగాళ్లు రీప్లే కోసం ఎదురుచూస్తోంది.

అప్పుడు రీప్లే చూపించకుండా.. నన్నేందుకు చూపిస్తున్నావంటూ రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

రోహిత్ శర్మ ఇలా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.