ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు దుబాయ్ గవర్నమెంట్ నుంచి అరుదైన గౌరవం లభించింది
ప్రసిద్ధ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) గోల్డెన్ వీసా తాజాగా బన్నీకి లభించింది
కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే ఇచ్చే యూఏఈ గోల్డెన్ వీసాను అందుకున్న తొలి టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ మాత్రమే
ఈ మేరకు బన్నీ దుబాయ్ దేశం ఫొటోను షేర్ చేస్తూ.. ‘నాకు ఎన్నో అనుభూతులు పంచిన దుబాయ్కి థాంక్స్. త్వరలోనే మళ్లీ కలుద్దాం’ అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు
ఈ వీసా ఇప్పటివరకు కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్, నటి కాజల్ అగర్వాల్, అమలా పాల్, ఖుష్బు సుందర్, త్రిష, బాలీవుడ్ బాద్షా షారుక్, సోనూసూద్, తమిళ హీరో విక్రమ్తో పాటు తదితర నటీనటులకు లభించింది
అంతేకాదు మెగా కోడలు, హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసనకు కూడా ఈ వీసా లభించింది
కాగా వివిధ రంగాల్లో అంటే కళలు, క్రియేటివిటీ పరిశ్రమలు, సాహిత్యం, కల్చర్, విద్య, వారసత్వ సంపద చరిత్ర గురించి అధ్యయనం చేసేవాళ్లు, సేవలు అందిస్తున్న వాళ్లకు యూఏఈ (దుబాయ్) గవర్నమెంట్ గోల్డెన్ వీసాను అందిస్తుంది
2019 నుంచి యూఏఈ ప్రభుత్వం జారీ చేస్తున్న ఈ వీసా ద్వారా దుబాయ్ లో దీర్ఘకాలికంగా ఎలాంటి పరిమితులు లేకుడా స్వేచ్ఛగా ఉండేందుకు వీలు కలుగుతుంది