మంచు మనోజ్ నటించిన ఝుమ్మంది నాధం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది తాప్సీ

అతి తక్కువ సమయంలోనే అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది తాప్సీ

ఒకానొక సమయంలో తెలుగులో వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది

హిందీలో వరుస సినిమాలు చేస్తూ అక్కడే స్టార్ హీరోయిన్‏గా కొనసాగుతుంది

కాగా తాజాగా తాప్సీ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది

నటి తాప్సీ పన్ను తాను మిస్ ఇండియా పోటీదారుగా ఉన్నప్పుడు "గ్రూమింగ్ పీరియడ్" సమయంలో అవమానానికి గురయ్యానని వెల్లడించింది

"వారు మమ్మల్ని నడిచేలా చేస్తారు.. నవ్వడం ఎలాగో నేర్పించారు. ఆ సమయంలో హేమంత్ త్రివేది ఎక్స్‌పర్ట్ టీచర్‌గా ఉండేవారు.. నన్ను అవమానపరిచారు" అని తాప్సీ పేర్కొంది.

"అది నా చేతిలో ఉంటే, మీరు ఎప్పుడూ టాప్ 28లో ఉండేవారు కాదు" అని ఆమె చెప్పింది