తలమొత్తం నొప్పి భరించలేక చాలామంది రెగ్యులర్‌గా పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు.ఇది ప్రమాదకరమని చెబుతున్నారు నిపుణులు.

వీటి వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఎక్కువ. తలనొవ్చి నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.

తాజా ద్రాక్ష పండ్లను తీసుకొని జ్యూస్‌ చేసి తాగడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనంపొందవచ్చు.

ఈ జ్యూస్‌ను రోజుకు రెండుసార్లు తాగితే సరిపోతుంది. ఒత్తిడిని, ఒళ్లు నొప్పులను తగ్గించడంలో అద్భుతం ఉపయోగపడుతుంది అల్లం.

తల నొప్పిని కూడా తగ్గుస్తుంది. అల్లంరసాన్ని కాస్త నిమ్మరసంలో కలిపి తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.

దాల్చిన చెక్క ఆహారానికి రుచిని ఇవ్వడమే కాదు.. తలనొప్పి తగ్గించడానికి కూడా ఉపయోగవడుతుంది.

దాల్చిన చెక్క పొడిగా చేసి నీటిలో కలిపి నుదుటిపై రాసుకొని 30 నిమిషాలు తర్వాత వేడి నీటితో కడిగితే నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు.

తల నొప్పి ఎక్కువైనప్పుడు మసాజ్‌ చేసుకోవడం వల్ల తలనొవ్చి నుంచిఉపశమనం పొందవచ్చు.

మెడ, తల భాగాన్ని నొక్కుతూ మసాజ్‌ చేసుకోవడం వల్ల రక్తప్రసరణ పెరిగి రిలాక్స్‌ అయ్యి నొప్పి నుండి తృప్తి పొందవొచ్చు.