బింబిసార’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సంయుక్త తర్వాత ‘సార్‌’ చిత్రంతో అభిమానులను సొంతం చేసుకుంది.

తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సరసన నటించిన  ‘విరూపాక్ష’ కూడా అంచనాలకు మించి విజయం విజయం అందుకుంది.

ఈ సందర్భంగా సంయుక్త మాట్లాడుతూ.. ‘నేను అందుకుంటున్న విజయాలకు చాలా ఆనందంగా ఉంది.

నేను ఎంత విజయాన్ని సాధించానో ఆలోచించేంత సమయం లేదు. ప్రస్తుతానికి నా ఆలోచనలన్నీ నా తర్వాత ప్రాజెక్ట్ పైనే ఉన్నాయి.

మంచి స్క్రిప్ట్‌లు ఎంచుకోవాలి. కొత్త విషయాలు నేర్చుకోవాలి. నేను సినిమాల్లోకి వచ్చిన దగ్గరి నుంచి ఇప్పటి వరకు చాలా ఒడుదొడుకులను ఎదుర్కొన్నాను.

స్టార్‌ హీరోయిన్ అవుతానని ఎవరూ ఊహించలేదు. నా మొదటి సినిమా విజయం సాధించినప్పుడు చాలా మంది నన్ను అభినందించారు.

ఆ క్షణం సినిమా విజయం సాధిస్తే ఎలా ఉంటుందో తెలిసింది. ఇప్పటి వరకు నేను నటించిన సినిమాల్లో ‘సార్‌’ నాకు ఎక్కువ గుర్తింపునిచ్చింది.

ఇక టాలీవుడ్‌ ప్రేక్షకులు నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపుతున్నారు. గతంలో ఒక హీరోయిన్‌ 10 సంవత్సరాలు మాత్రమే అగ్ర నటిగా కొనసాగగలదు అనుకునేవారు.

ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి’’ అని తెలిపింది.