బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు నటి ప్రియాంకా చోప్రా.
గడిచిన పదేళ్లలో ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు వచ్చాయని ఆమె అన్నారు.
రాజకీయాలతో కాకుండా.. టాలెంట్ను ఆధారంగా నటీనటులను ఎంచుకునే రోజులు రావాలని పేర్కొన్నారు ప్రియాంక.
‘‘టాలెంట్, అవకాశాలు.. దీనిపై చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎంటర్టైన్మెంట్ రంగం మునుపెన్నడూ లేనంతగా వృద్ధి చెందింది. గడిచిన పదేళ్లలో బాలీవుడ్ ఎంతో మారింది.
టాలెంట్ ఉన్న రచయితలు, దర్శకులు, నటీనటులు.. ఇలా ఎంతోమంది బయటవాళ్లు పరిశ్రమలోకి అడుగుపెట్టారు.
నేను కెరీర్ మొదలుపెట్టినప్పుడు పరిస్థితులు ఇలా లేవు. మా తరం నటీనటులు పోరాటం చేయబట్టే పరిస్థితులు ఇలా మారాయి.
నువ్వు ఫెయిల్ అయినప్పుడే నీ ప్రపంచం నిన్ను మరింత కిందకు తొక్కేయడానికి ప్రయత్నిస్తుంటుంది. ఎందుకంటే, మనుషుల స్వభావం అదే.
అలాంటి, సమయంలో మీ విలువను మీరు గ్రహించి ముందుకు అడుగువేయాలి. అదే మా వాళ్లు నాకు నేర్పించారు’’ అని తెలిపారు ప్రియాంక.