తాజాగా జిన్నా సినిమాలో నటించిన పాయల్ రాజ్ పుత్ మీడియాతో ముచ్చటించారు.

ఆర్‌క్స్‌ 100 సినిమాతో తనకు మంచి గుర్తింపు వచ్చిందని. అయితే..

ఆ తర్వాత తన మేనేజర్‌తో పాటు కొందరు తప్పు దారి పట్టించడంతో స్క్రిప్టు వినకుండానే కొన్ని సినిమాల్లో నటించానని చెప్పుకొచ్చింది.

అయితే ఇప్పుడు అలా కాదని, తనకు నచ్చిన కథలోనే నటించేందుకు ఇష్టపడుతున్నట్లు చెప్పుకొచ్చింది.

కంటెంట్‌ బాగుంటే ప్రేక్షకులకు తప్పకుండా ఆదరిస్తారనే దానికి ఆర్‌ఎక్స్‌ 100 నిదర్శనమని తెలిపిందీ బ్యూటీ.

ఇప్పుడు ఈ అమ్మడు నటించిన జిన్నా మూవీతో అయినా ఫార్మ్ లోకి వస్తుంది ఏమో చూడాలి..