మెంటల్‌ మదిలో సినిమాతో టాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నివేదా పేతురాజ్‌. ఆతర్వాత సాయిధరమ్‌ తేజ్‌తో కలిసి చిత్రలహరి సినిమాలో కనిపించింది.

చేసింది తక్కువ సినిమాలే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుందీ సొగసరి. అయితే సూపర్‌ హిట్‌మాత్రం ఈ అందాల భామకు దక్కలేదు.

ఈక్రమంలో స్టార్‌ హీరోయిన్‌ అన్న ట్యాగ్‌పై స్పందించిన నివేద పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.నాకు హీరోయిన్‌ కన్నా నటిగా అనిపించుకోవడమంటేనే గర్వంగా ఉంటుంది.

హీరోయిన్‌గా సినిమాలు చేయకపోతే ఇక కెరీర్‌ ఉండదేమో అని చాలా మంది భయపడుతుంటారు. నాకు మాత్రం అలాంటి భయం లేదు.

కెరీర్‌కు సంబంధించి ఎలాంటి పరిధులు పెట్టుకోలేదు. నటనకు ప్రాధాన్యముంటే ఎలాంటి పాత్రలైనా చేస్తాను.

ఒకవేళ సినిమా అవకాశాలు రాకుంటే ఏదైనా ఉద్యోగం చేసుకుంటాను’ అని చెప్పుకొచ్చింది నివేద.

పాగల్ సినిమాతో విశ్వక్ సేన్ తో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు మరోసారి దమ్కీ మూవీ తో రానుంది.