కృతి సనన్ ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది

దాంతో ఈ అమ్మడు తెలుగులో కంటిన్యూ అవుతుందని అనుకున్నారు కానీ ఊహించని విధంగా ఈ అమ్మడు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది.

తర్వాత అక్కినేని నాగచైతన్య హీరోగా వచ్చిన దోచెయ్ సినిమాలో నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

దాంతో ఈ బ్యూటీ బాలీవుడ్ కు పరిమితం అయిపోయింది. ఇక ఇప్పుడు పాన్ ఇండియా మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ఆదిపురుష్ సినిమాలో నటిస్తోంది కృతి.ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రామాయణ నేపథ్యంలో రానుంది.

ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా సీత పాత్రలో నటిస్తుంది కృతిసనన్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.

ఇక కృతిసనన్ సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటోంది. సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విశేషాలను కూడా అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటోంది ఈ చిన్నది.

తాజాగా కృతి సనన్ పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. బ్లాక్ కలర్ డ్రస్ లో కృతి ఇచ్చిన ఫోజులు కుర్రకారు మతిపోగొడుతున్నాయి.