గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కించిన తాజా చిత్రం వీర సింహారెడ్డి.

ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటించిన మెప్పించింది. మరో కీలకపాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నటించి మెప్పించింది.

ఇదిలా ఉంటే వీర సింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ హనీ రోజ్.

ఈ సినిమా కంటే ముందు హనీ రోజ్ మలయాళంలో చాలా సినిమాలు చేసింది.

వీరసింహారెడ్డి తర్వాత హనీ రోజ్ పేరు టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తోంది.

15 ఏళ్ల వయసులోనే బాయ్ ఫ్రెండ్ అనే మలయాళ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ 2008లోనే టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చింది.

 శివాజీ రాజా హీరోగా నటించిన ఆలయం సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా హిట్ అవ్వలేదు.

అంతేకాకుండా మళ్ళీ వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ వర్షం సాక్షిగా సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసింది. ఈ సినిమా కూడా హిట్ అవ్వలేదు.