మంగళవారం సాయంత్రం తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్న సంగతి తెలిసిందే.

దీనికోసం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో అయోధ్య సెట్ కూడా వేశారు.

2 కోట్ల ఖర్చుతో ఎన్నడూ జరగని రీతిలో భారీ స్థాయిలో ఈ ఈవెంట్ జరగనుంది.

కాగా మంగళవారం తెల్లవారుజామున ‘ఆదిపురుష్‌’ చిత్ర బృందంతో కలిసి తిరుపతి చేరుకున్నారు ప్రభాస్

తిరుమల స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారి దర్శనం చేసుకున్నారు అయన.

అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ప్రభాస్‌కు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.

కాగా ఆదిపురుష్ చిత్రం ఈ నేల 16న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటించారు.

ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనాన్ సీతగా కనిపించనున్నారు.

600 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ చిత్ర ట్రయిలర్ ఐ ఫీస్ట్ అనిపించింది.