వర్షాకాలంలో ఈ టీలు..  డెంగ్యూ-మలేరియాను తరిమికొట్టే పాశాలు..

TV9 Telugu

14 June 2024

తులసి ఆకులలో యాంటిపైరేటిక్, డయాఫోరేటిక్ లక్షణాలు విపరీతమైన చెమట ద్వారా శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. దీనివల్ల తులసి ఆకుల రసం జ్వరానికి మేలు చేస్తుంది.

పసుపు పాలు తాగితే జ్వరం నుండి ఉపశమనం పొందవచ్చు. ఇది శరీరంలో వేడిని పెంచడం ద్వారా ఇన్ఫెక్షన్‌ను తొలగిస్తుంది.

పసుపు పాలు తీసుకోవడం వల్ల ఒళ్లు నొప్పులను కూడా తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

అల్లంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా ఇన్ఫెక్షన్‌ను దూరం చేస్తుంది.

వర్షకాలంలో జ్వరంతో ఇబ్బంది పడుతున్నట్టయితే.. అల్లం రసం తాగొచ్చని అంటున్నారు పోషకాహార నిపుణులు, వైద్యులు.

మలేరియా-డెంగ్యూ రోగులకు దాల్చిన చెక్క టీ ఒక అద్భుతమైన ఔషధం. ఆయుర్వేదంలో ఇది జ్వరానికి అద్భుత ఔషధంగా పరిగణించబడుతుంది.

తిప్పతీగ కషాయాలను తీసుకోవడం వల్ల జ్ఞాన త్వరగా తగ్గుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ పైరేటిక్ గుణాల వల్ల జ్వరం మళ్లీ పెరగదు.

రోజూ వేప ఆకులను తినడం వల్ల అధిక జ్వరం, మలేరియా, ఫ్లూ, డెంగ్యూ, వైరస్ వంటి అనేక ఇన్ఫెక్షన్లు నయమవుతాయి. బ్యాక్టీరియా, వైరస్‌లను నిర్మూలించే శక్తి దీనికి ఉంది.