చార్ ధామ్ యాత్రలో తప్పక చూడాల్సిన 8 ప్రదేశాలు ఇవే.. 

26 May 2025

Prudvi Battula 

మజ్జిగను ఉప్పుతో తీసుకుంటే వాతాన్ని తగ్గిస్తుంది. పటిక బెల్లంతో తీసుకుంటే పైత్యం తగ్గుతుంది. మజ్జిగకు శొంఠి, పిప్పళ్లు, మిరియాల చూర్ణం కలిపి తీసుకుంటే కఫం తగ్గుతుంది.

ఆవు పాల మజ్జిగ పథ్యంగా, ఆకలిని పెంచేదిగా, రుచికారకంగా, బుద్ధివర్థకంగా పనిచేస్తుంది. గేదె పాల మజ్జిగ కఫాన్ని, గే వాపును పెంచుతుంది. కాబట్టి పరిమితంగా వాడాలి.

కేవలం వేసవి కాలంలోనే కాదు.. మజ్జిగను ఏ సీజన్‌లో అయినా తీసుకోవచ్చు. ఇందులోని సోడియం , క్యాల్షియం మూలకాలు, ప్రోటీన్స్, మినరల్స్ శరీరానికి కావాల్సిన శక్తిని , పోషకాలను అందిస్తాయి.

మజ్జిగను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలోనే కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుముఖం పడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

రోజు మజ్జిగ తాగటం వల్ల ఎముకలకు కావాల్సిన బలాన్నిస్తుంది. మజ్జిగ శరీరంలో పేరుకు పోయిన మలినాలను బయటకు పంపుతుంది.

మజ్జిగ అజీర్తి, అసిడిటీ సమస్యలను తగ్గించి రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారు. రోజూ ఉదయం మజ్జిగ తీసుకుంటే ఫలితం ఉంటుంది.

వేయించిన జీల కర్ర , ధనియాల పొడిని మజ్జిగలో కలిపి తీసుకుంటే చలువ చేయటంతో పాటు వాతం, కఫము వాటి సమస్యలు తగ్గుతాయి. మజ్జిగలో కాస్తంత సొంఠి పొడి వేసి తాగితే ఆకలి పెరుగుతుంది.

మజ్జిగలో ఇంగువనూ, జీలకర్రనూ, ఉప్పు కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది. పైల్స్ వ్యాధిలో మజ్జిగ బాగా పనిచేస్తుంది.