ఈ సుగంధ ద్రవ్యాలతో అధిక బరువుకి చెక్..
TV9 Telugu
19 February 2025
సుగంధ ద్రవ్యాలు లేకుండా భారతీయ ఆహారం అసంపూర్ణం. అవి మీ ఆహారంలో రుచిని పెంచడమే కాదు బరువు తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటాయి.
బెల్లీ ఫ్యాట్ని తగ్గించడంలో కూడా తోడ్పడుతాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ మసాలా దినుసుల గురించి ఒక్కసారి తెలుసుకుందాం.
పసుపును కరివేపాకుతో పాటు మరిగించి తీసుకుంటే చాలా మంచిది. బెల్లీ ఫ్యాట్ని కరిగించే గుణాలు ఇందులో ఉంటాయి.
చాలా మంది తిన్న తర్వాత సోంపు వేసుకునే అలవాటు ఉంటుంది. ఉదయం సమయంలో నీటిలో వేసి మరిగించి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
సోంపులో విటమిన్లు ఎ, సి, డి, యాంటీ-ఆక్సిడెంట్ల మంచి మూలం ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
జీలకర్ర అనేది సాధారణం మసాలా. మీరు బరువు తగ్గాలనుకుంటే ప్రతి రాత్రి ఒక టీస్పూన్ జీలకర్రను నానబెట్టి ఉదయం నీటిలో కలిపి తాగండి.
ఇది బెల్లీ ఫ్యాట్పై తీవ్ర ప్రభావం చూపుతుంది. మీరు దీనిని సూప్స్, పప్పు, కూరలలో కూడా మంచిగా ఉపయోగించవచ్చు.
మెంతి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది అతిగా తినకుండా నిరోధిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు మెంతులను డైట్లో చేర్చుకుంటే మంచిది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆఫ్ఘనిస్తాన్ను పాలించిన హిందూ చక్రవర్తులు వీరే..
విమానంలో ఆటోపైలట్ మోడ్ ఎలా పని చేస్తుందో తెలుసా.?
ఇంటికి అతిథులు వస్తున్నారా.? రోజ్ కొబ్బరి లడ్డు ట్రై చేయండి..