సన్నబడటం కోసం ప్రతి రోజు ఓట్స్ తింటున్నారా? అయితే శరీరం షెడ్డుకే

10 June 2026

Pic credit - Instagram

Phani Ch

ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది బరువు తగ్గాలనే ఉద్దేశంతో వైట్‌ రైస్‌ కి బదులుగా వివిధ రకాలైన డైట్‌ఫుడ్‌ తీసుకోవటం అలవాటు చేసుకుంటున్నారు.

ఇందులో ఓట్స్‌ మొదటి స్థానంలో ఉంటుంది. అయితే వీటిని ఎక్కువగా తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఓట్స్‌ ఎక్కువగా తీసుకోవటం వల్ల వాయువు, గ్యాస్‌ వంటి జీర్ణ సంబంధ సమస్యలు రావచ్చు. ఓట్స్‌లో ఉండే ఫైటేట్స్ వల్ల శరీరానికి అవసరమైన న్యూట్రియెంట్స్ అందకపోవచ్చు.

బరువు తగ్గడానికి ఓట్స్ మంచిదనుకుంటారు.. కానీ తగ్గిన క్యాలరీల కారణంగా శరీరానికి అవసరమైన శక్తి అందకపోవచ్చు.

ఓట్స్ తిన్న.. తక్కువ సమయంలోనే మళ్లీ ఆకలి అనిపించేలా చేసి, అధికంగా తినిపించవచ్చు. ప్రతి ఒక్కరి శరీరానికి ఓట్స్ సరిపోకపోవచ్చు.

విషేషంగా అలెర్జీ ఉన్నవారు ఓట్స్‌కి దూరంగా ఉండడం మంచిదంటున్నారు. ప్రతిరోజూ ఎక్కువగా ఓట్స్‌ తీసుకుంటే పెద్ద మొత్తంలో బరువు పెరిగే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.

చాలా కంపెనీలు ఇచ్చే ఓట్స్ ప్రాసెస్డ్ అయి ఉండటం వల్ల అందులో పోషకాలు తగ్గిపోతాయి, గ్లైసెమిక్ ఇండెక్స్ పెరిగి డయబెటిక్ పేషెంట్స్‌కి హాని కలిగించే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఓట్స్‌లో ఫైటిక్‌ యాసిడ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కాల్షియం, జింక్‌ వంటి ఖనిజాల శోషణను నిరోధిస్తాయి.  ఓట్స్‌ని నానబెట్టడం లేదా పులియబెట్టడం వల్ల వాటిలో ఫైటిక్‌ యాసిడ్‌ కంటెంట్‌ తగ్గుతుంది.

ఇవి గ్లూటెన్‌ రహితంగా ఉన్నప్పటికీ..తరుచుగా గోధుమ, బార్లీ మాదిరిగా ప్రాసెస్‌ చేయబడతాయి. ఇది ఉదర కుహర వ్యాధి, గ్లూటెన్‌ సెన్సిటివిటీకి దారితీస్తుంది.