వీటిని తీసుకుంటే.. జరా భద్రం బసు..

TV9 Telugu

10 June 2024

ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమయ్యే ఆహారాల్లో పాలకూర నంబర్ వన్‌ ప్లేస్ లో ఉంది. కాబట్టి తినే ముందు శుభ్రంగా కడుక్కోవడం మంచిది.

కోడి గుడ్డుపై అతుక్కుపోయి కొన్ని క్రిములు ఉన్న కారణంగా వాటిని అలాగే తీసుకుంటే రోగాల బారిన పడే ఛాన్స్ ఉంటుంది.

పిల్లలు, వృద్ధులు, బలహీన రోగనిరోధక శక్తి  కలిగిన వారు ముఖ్యంగా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే  గుడ్లు కడిగిన తర్వాతే తినాలి.

మాంసంలో క్యాంపిలోబాక్టర్ అనే బ్యాక్టీరియా  కలిగి ఉన్న కారణంగా జ్వరం, జీర్ణశయాంతర సమస్యలు కారణమవుతుంది.

చికెన్ కడిగినప్పటికీ  ఈ బ్యాక్టీరియా ఇంకా మిగిలి ఉంటుంది. ఉందుకే చికెన్‌ను బాగా కడగాలి. ఇది కట్ చేసిన వెంటనే కట్టింగ్ బోర్డులు, కత్తులను శుభ్రంగా కడగాలి.

డీఫ్రాస్ట్ చేసిన చేపల స్టోర్ చేసినప్పుడు జాగ్రత్త వహించకుంటే చర్మపై దద్దుర్లు, వాంతులు, పొత్తికడుపు నొప్పి, అతిసారం, దృష్టిని కోల్పోయేలా చేసే ప్రమాదం ఉంది.

చీజ్‌లో ఎటువంటి విషపూరిత రసాయనాలు లేనప్పటికీ దీన్ని తయారుచేసినప్పుడు కల్తీ జరిగితే మాత్రం విషంగా మారుతుంది.

దీని తయారీ సమయంలో జబ్బుపడిన జంతువులు దగ్గర లేకుండా చూసుకోవాలి. పాశ్చరైజ్డ్ పాలను ఉపయోగిస్తే లిస్టెరియోసిస్ అభివృద్ధి చెందే ప్రమాదం ఉంది.