తాజాగా హీరో  గోపీచంద్‌ 31వ చిత్రం పట్టాలెక్కింది

కన్నడ దర్శకుడు ఎ.హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్నారు

శుక్రవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది

ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత రాధామోహన్‌ మాట్లాడుతూ ‘‘ఇదొక చక్కటి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌.

కుటుంబ భావోద్వేగాలతో పాటు అన్ని రకాల వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉంటాయి

గోపీచంద్‌ కెరీర్‌లో పూర్తి భిన్నమైన చిత్రంగా నిలుస్తుంది

ఈనెలలోనే రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఇతర నటీనటుల వివరాల్ని త్వరలో ప్రకటిస్తాం’’ అని తెలిపారు