అత్యధిక పరుగుల వీరులు వీరే.. లిస్టులో 7గురు టీమిండియా ప్లేయర్లు..

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య అహ్మదాబాద్‌లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో మైలురాయిని చేరుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో మూడో రోజు తన ఇన్నింగ్స్‌లో 22వ పరుగు పూర్తి చేసిన వెంటనే అంతర్జాతీయ క్రికెట్‌లో 17000 పరుగులు పూర్తి చేశాడు.

భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన 7వ బ్యాట్స్‌మెన్‌‌గా నిలిచాడు.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (34357)

విరాట్ కోహ్లీ (25012)

రాహుల్ ద్రవిడ్ (24208)

సౌరవ్ గంగూలీ (18575)

ఎంఎస్ ధోని (17266)

వీరేంద్ర సెహ్వాగ్ (17253)

రోహిత్ శర్మ (17014)