డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు గాయాల బెడద.. దూరమైన నలుగురు..

ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీపీ ఫైనల్ ఆడనుంది.

జూన్ 7 నుంచి ఓవల్‌లో ఇరు జట్ల మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

అయితే భారత జట్టుకు సమస్యలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు, గాయపడిన భారత ఆటగాళ్ల జాబితా పెరుగుతోంది.

రిషబ్ పంత్‌తో పాటు, జస్ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ వంటి పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

తాజాగా ఈ జాబితాలోకి కేఎల్ రాహుల్ రూపంలో కొత్త పేరు చేరింది.

టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC Final)కి ముందు భారత క్రికెట్ జట్టు ఆటగాళ్ల గాయంతో నిరంతరం పోరాడుతోంది.

అదే సమయంలో ఇప్పుడు కేఎల్ రాహుల్ గాయం కారణంగా టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

ఈ విధంగా, టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు భారత జట్టు సమస్యలు నిరంతరం పెరుగుతున్నాయి.

ఐపీఎల్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కేఎల్ రాహుల్ గాయపడ్డాడు.

ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి.