యాడ్‌ ఫిల్మ్‌మేకర్‌, సినిమాటోగ్రాఫర్‌ శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతుంది

ఈ చిత్రంతో మాజీ  ‘ప్రపంచ సుందరి’ మానుషీ చిల్లర్‌ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం కానున్నారు

2017లో మిస్‌ వరల్డ్‌ కిరీటం కైవసం ఈ నార్త్‌ బ్యూటీ హిందీలో ‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌’చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యారు

ఇప్పుడు వరుణ్‌ తేజ్‌ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నారు మానుషీ చిల్లర్‌

తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం

తెలుగు,హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు

ఈ చిత్రంలో వరుణ్‌ తేజ్‌ భారతీయ వైమానిక దళ పైలట్‌గా కనిపించనున్నారు

అలాగే మానుషి రాడార్‌ ఆఫీసర్‌ పాత్ర పోషించనున్నారు