యాగంటి ఉమామహేశ్వర దేవాలయం ప్రసిద్ధ శైవ క్షేత్రం
నంద్యాల జిల్లా బనగానపల్లి సమీపంలో ఉంది
ఈ దేవాలయాన్ని వైష్ణవ సంప్రదాయంలో నిర్మించారు
ఇక్కడ ప్రతిష్టించిన నంది విగ్రహం అంతకంతకూ పెరుగుతూ ఉంటుంది
యాగంటి ఆలయంలోని నంది విగ్రహానికి "యాగంటి బసవన్న" అని పేరు
ఒకే శిలపై పార్వతీ సమేతుడై ఉమామహేశ్వరుడు దర్శనమిస్తున్నాడు
శివరాత్రి రోజు ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి
కోనేరు లోని నీరు ఒకే మట్టంలో ఉండడం విశేషం
ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని భక్తుల నమ్మకం